ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష..
- September 02, 2021
ఏపీ: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు.. హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. 2015లో భూమి వ్యవహారంలో .. నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటి వరకు బాధిత మహిళకు నష్టపరిహారం అందజేయలేదు. దీంతో రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్కు నెల రోజల జైలు శిక్ష, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు 2 వారాలు, రావత్కు నెల రోజులు, ముత్యాల రాజుకు 2 వారాల జైలు శిక్షతో పాటు వీరిందరికీ వేయి రూపాయల చొప్పున జరిమానా విధించారు. దీంతో పాటు బాధిత మహిళకు లక్ష రూపాయల చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అదికూడా.. ప్రభుత్వ నిధి నుంచి కాకుండా అధికారుల సొంత డబ్బుతో చెల్లించాలని కోర్టు తెలిపింది. అయితే ప్రతివాదుల అభ్యర్ధన మేరకు శిక్షను నాలుగు వారాల పాటు నిలుపుదల చేసింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









