తెలంగాణ కరోనా అప్డేట్
- September 04, 2021_1630771903.jpg)
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు, నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 306 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,59,313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 3,883 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 366 మంది కోలుకఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,49,757 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.55 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,673 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,422 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి రాష్ట్రంలో 24917603 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!