స్టేడియంలోకి ఆడియన్స్ కి అనుమతి

- September 07, 2021 , by Maagulf
స్టేడియంలోకి ఆడియన్స్ కి అనుమతి

కువైట్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తున్న కువైట్..లేటెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు కూడా వెసులుబాటు కల్పించింది. స్పోర్ట్స్ సీజన్ 2021/2022లో స్టేడియంలోకి ఆడియన్స్ ను అనుమతించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి స్టేడియంలో జరిగే మ్యాచులను ప్రజలు ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే లోనికి ఎంట్రీ ఉంటుంది. అలాగే స్టేడియం కెపాసిటీలో 30 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. మ్యాచులను ప్రత్యక్ష చూసేందుకు స్టేడియాలకు వెళ్లే ప్రేక్షకులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రివర్గం కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com