ముంపు సమస్యపై యుద్ధప్రాతిపదికన అష్గల్ రెస్పాన్స్
- March 15, 2016
భారీ వర్షాలతో ఖతార్ కొద్ది రోజుల క్రితం అతలాకుతలమైంది. అయితే పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, అద్భుతమైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మార్చ్ 7 నుంచి 9 వరకు భారీ వరానషలు కురిశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేర్వేరుగా టీమ్లను అష్గల్ నియమించింది. ఒక్కో టీమ్ని ఒక్కో చోటకు పంపించి, వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించింది అష్గల్. ఎమర్జన్సీ స్టాండ్ బై ఏర్పాటు చేయడం ద్వారా సకాలంలో స్పందించడానికి వీలయ్యిందని అష్గల్ అధికారులు చెప్పారు. దోహా, అల్ రయ్యాన్, ఉమ్ సలాల్ మున్సిపాలిటీల్లో నీటి ముంపు సమస్య ఎక్కువగా కన్పించింది. ప్రధాన రహదార్లు, టన్నెల్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ని క్లియర్ చేసేందుకు మెరికెల్లాంటి సిబ్బందితోపాటు, తగిన యంత్రాలను, సాంకేతిక సహాయాన్ని ఉపయోగించామని అష్గల్ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







