రిహాబిలిటేషన్ కేంద్రాలకు చెందిన కొత్త స్కూళ్ళకు సెప్టెంబర్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం

- September 11, 2021 , by Maagulf
రిహాబిలిటేషన్ కేంద్రాలకు చెందిన కొత్త స్కూళ్ళకు సెప్టెంబర్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం

బహ్రెయిన్: రిహాబిలిటేషన్ మరియు ఒకేషనల్ కేంద్రాలు మరియు ఇనిస్టిట్యూషన్స్, సెప్టెంబర్ 12 ఆదివారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నాయి. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామనీ, 109 మంది ప్రత్యేకావసరాలుగల విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామనీ అన్నీరు. చైల్డ్ డే కేర్ సెంటర్స్, ఎన్‌బిబి రిహాబిలిటేషన్ సెంటర్, బిబికె రిహాబిలిటేషన్ సెంటర్ మరియు షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ కేంద్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష విద్యా విధానం లేదా రిమోట్ లెర్నింగ్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com