పావులు కదుపుతున్న బీజేపీ
- September 12, 2021
గుజరాత్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ బీజేపీ ప్రభుత్వం బలంగానే ఉన్నది. అయితే, పటేల్ వర్గం నుంచి కొంత వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది బీజేపీ. ఎన్నికల్లో పటేల్ వర్గానికి అత్యధిక ఓటు బ్యాంకు ఉంటుంది. వీరి ఓట్లే కీలకం కావడంతో వీరిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్ ముఖ్యమంత్రిని మార్పు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. విజయ్ రూపానీ జైన్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటుగా, కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంతో కొంత ఇబ్బందులు పడటం, రాజకీయ నాయకులకు కాకుండా ఆయన అధికారులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన్ను పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా గెలచి మరోసారి గుజరాత్పై పట్టు నిలుపుకోవాలని బీజేపీ చూస్తున్నది. గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవటం 99 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపి విజయం సాధించినా, రాబోయే ఎన్నికలు కీలకంగా మారడంతో మార్పులు చేపట్టింది. కాంగ్రెస్తో పాటు ఆప్ కూడా క్రమంగా బలపడుతుండటంతో బీజేపీ పటేల్ వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నది.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









