సాయి ధరమ్ తేజ్ కు ఆపరేషన్ విజయవంతం..ఊపిరి పీల్చుకున్న అభిమానులు
- September 12, 2021రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్కి ట్రీట్మెంట్ అందించనున్నారు. నిరంతరం డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ఉంటారని , ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో సాయి ధరమ్కి కాలర్ బోన్ ఫ్రాక్చర్, కన్ను, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం లేదని అపోలో వైద్యులు తెలిపారు. ఇక హీరో రామ్చరణ్, నిర్మాత అల్లు అరవింద్ అపోలో ఆస్పత్రికి చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటున్నారు.
తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్తో అభిమానులలో కాస్త ఆందోళన తగ్గింది. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా, సాయి ధరమ్కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా,ఆయన నొప్పి అని అనడం కనిపించింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం