ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- September 12, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల 5 కేజీల బంగారం పెట్టుకున్నారు. దుబాయ్, మస్కట్ ప్రయాణీకుల వద్ద 5 కేజీలకు పైగా బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అయితే కస్టమ్స్ అధికారులే ఆశ్చర్య పోయే విధంగా బంగారంను వెరైటీ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. కేజీ బంగారాన్ని నోటిలో వున్న పళ్ళకు అతికించి దర్జాగా బయట చెక్కేసే ప్రయత్నం చేసారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో అక్రమ బంగారం గుట్టు బయటపడింది. మరో కేసు లో బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. ఆ బంగారు పేస్టును జీన్స్ ప్యాంటు నడుము బాగంతో పాటు టీ షర్టు మెడ బాగంలో దాచారు కేటుగాళ్లు. ఈ బంగారం స్మగ్లింగ్ చేస్తూ… ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి అడ్డంగా బుక్ అయ్యారు 6 మంది ప్రయాణీకులు. ఒకే రోజు 5 కేజీలకు పైగా బంగారం తో పాటు ఏడు మందిని అరెస్టు చేసారు కస్టమ్స్ అధికారులు. ఆ 5 మంది దుబాయ్ ప్రయాణీకుల తో పాటు విమానాశ్రయం బయట బంగారాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









