సీబీఐ కోర్టులో జగన్కు ఊరట
- September 15, 2021
హైదరాబాద్: సీబీఐ కోర్టులో సీఎం జగన్కు రిలీఫ్ దొరికింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం









