ఇక అభిమానుల మధ్య ఐపీఎల్..2వ ఫేజ్లో ఫ్యాన్స్ కి అనుమతి
- September 15, 2021యూఏఈ: కోవిడ్ భయంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ లేక వెలవెలపోయిన స్టాండ్స్ ఇక సందడిగా మారబోతున్నాయి. వీవో ఐపీఎల్ 2021 కొత్త వేదికలు క్రికెట్ అభిమానులకు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో చెన్నై-ముంబై మధ్య జరిగే తొలి మ్యాచ్ కు దుబాయ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ కు ఫ్యాన్స్ హజరయ్యేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. డిఫెండెబుల్ ఛాంపియన్ హోదాలో బరిలోకి ముంబై హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్ కోసం రేసులో నిలవగా..అపోనెంట్ చెన్నై టీం గతేడాది వైఫల్యాలను అదిమించేలా బ్రేక్ తర్వాతి చెలరేగిపోయేందుకు రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్ మహా వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న అభిమానులు..ఇక కోవిడ్ అడ్డంకులతో బేజారవ్వాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 16 నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ http://www.iplt20.comలో టికెట్లు కొనుగోలు చేయవచ్చు లేదా http://PlatinumList.netలో కూడా టిక్కెట్లను కొనుక్కోవచ్చు. అయితే..కోవిడ్ ప్రోటోకాల్, యూఏఈ ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే అభిమానులను అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ