రియాద్ వ్యక్తిగత వివరాల గోప్యతకు కొత్త చట్టం
- September 15, 2021
రియాద్: వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను సేకరించే చర్యలను ఉపేక్షించబోమని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత డేటా రక్షణ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇతర వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను సేకరించటాన్ని ఈ చట్టం నిలువరిస్తుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా భద్రత ఇచ్చే ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా మరో ఆరు నెలల్లో అమలులోకి వస్తుందని సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ప్రకటించింది. డేటాలో పేరు, గుర్తింపు సంఖ్య, చిరునామా, ఫోన్ నంబర్, వ్యక్తిగత రికార్డులు, ఆర్థిక రికార్డులు, చిత్రాలు, వీడియోలు లేదా ఏదైనా ఇతర గుర్తింపు వివరాలకు ఈ చట్టం ద్వారా భద్రత దొరుకుతుంది. అయితే..డేటా యజమానికి తన వ్యక్తిగత వివరాలను ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత కాలం పాటు ప్రాసెస్ చేసేలా అభ్యర్ధనతో కూడిన అనుమతితో డేటా పొందవచ్చు. ఇది ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులను గుర్తించటం వంటి పరిస్థితుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







