రియాద్ వ్యక్తిగత వివరాల గోప్యతకు కొత్త చట్టం
- September 15, 2021
రియాద్: వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను సేకరించే చర్యలను ఉపేక్షించబోమని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత డేటా రక్షణ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇతర వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత వివరాలను సేకరించటాన్ని ఈ చట్టం నిలువరిస్తుంది. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా భద్రత ఇచ్చే ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా మరో ఆరు నెలల్లో అమలులోకి వస్తుందని సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) ప్రకటించింది. డేటాలో పేరు, గుర్తింపు సంఖ్య, చిరునామా, ఫోన్ నంబర్, వ్యక్తిగత రికార్డులు, ఆర్థిక రికార్డులు, చిత్రాలు, వీడియోలు లేదా ఏదైనా ఇతర గుర్తింపు వివరాలకు ఈ చట్టం ద్వారా భద్రత దొరుకుతుంది. అయితే..డేటా యజమానికి తన వ్యక్తిగత వివరాలను ప్రత్యేక పరిస్థితుల్లో పరిమిత కాలం పాటు ప్రాసెస్ చేసేలా అభ్యర్ధనతో కూడిన అనుమతితో డేటా పొందవచ్చు. ఇది ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులను గుర్తించటం వంటి పరిస్థితుల్లో ఈ వెసులుబాటు ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







