వ్యాక్సిన్ సర్టిఫికెట్, పీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ఎక్స్పో 2020కి ఎంట్రీ
- September 16, 2021యూఏఈ: కోవిడ్ నేపథ్యంలో ఎక్స్ పో 2020 ఎంట్రీపై యూఏఈ ప్రభుత్వం అప్ డేట్ చేసిన గైడ్ లైన్స్ ప్రకటించింది. ఎక్స్ పో 2020కి వచ్చే సందర్శకులు ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ గానీ, 72 గంటలలోపు తీసుకున్న పీసీఆర్ రిపోర్ట్ నుగానీ చూపించాల్సి ఉంటుంది. అయితే..ఇప్పటికే ఎక్స్ పో టికెట్ కొనుగోలు చేసిన సందర్శకులు టీకా వేసుకోకుండా, పీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోని పక్షంలో ఎక్స్ పో ప్రాంగణంలో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎక్స్ పో ప్రాంగణంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎక్స్ పో టికెట్ ను చూపిస్తే ఫ్రీగా టెస్ట్ చేస్తారు. ఇక ఎక్స్పోలో పాల్గొనే అంతర్జాతీయ వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు టీకాలు తప్పనిసరి. అలాగే కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం సూచించిన అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్-సైట్ శానిటైజేషన్ స్టేషన్లు, ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ధరించటం, రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించటం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు