వ్యాక్సిన్ సర్టిఫికెట్, పీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ఎక్స్పో 2020కి ఎంట్రీ
- September 16, 2021
యూఏఈ: కోవిడ్ నేపథ్యంలో ఎక్స్ పో 2020 ఎంట్రీపై యూఏఈ ప్రభుత్వం అప్ డేట్ చేసిన గైడ్ లైన్స్ ప్రకటించింది. ఎక్స్ పో 2020కి వచ్చే సందర్శకులు ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ గానీ, 72 గంటలలోపు తీసుకున్న పీసీఆర్ రిపోర్ట్ నుగానీ చూపించాల్సి ఉంటుంది. అయితే..ఇప్పటికే ఎక్స్ పో టికెట్ కొనుగోలు చేసిన సందర్శకులు టీకా వేసుకోకుండా, పీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోని పక్షంలో ఎక్స్ పో ప్రాంగణంలో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎక్స్ పో ప్రాంగణంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎక్స్ పో టికెట్ ను చూపిస్తే ఫ్రీగా టెస్ట్ చేస్తారు. ఇక ఎక్స్పోలో పాల్గొనే అంతర్జాతీయ వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లకు టీకాలు తప్పనిసరి. అలాగే కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం సూచించిన అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆన్-సైట్ శానిటైజేషన్ స్టేషన్లు, ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ధరించటం, రెండు మీటర్ల సామాజిక దూరాన్ని పాటించటం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







