ఇరాక్ అంతర్జాతీయ సమావేశానికి హజరవనున్న ఖతార్
- September 16, 2021
బగ్ధాద్: దోచుకున్న సొమ్ము రికవరీ, రికవరీ అయిన నిధుల ద్వారా జమ అయిన నిధుల సద్వినియోగం అంశాలతో రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సమావేశానికి బగ్ధాద్ వేదికైంది. అయితే..సమావేశంలో తాము కూడా పాల్గొంటున్నట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ఖతార్ ప్రతినిధి బృందానికి న్యాయ మంత్రి మసూద్ బిన్ మొహమ్మద్ అల్ అమ్రి నేతృత్వం వహిస్తారు. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సహకారంతో, అరబ్ న్యాయ మంత్రుల సమక్షంలో ఇరాక్ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో అవినీతిపై పోరాటం, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడం, అరబ్ పౌరుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించటం వంటి అంశాలను సమీక్షిస్తారు. అనంతరం సమావేశ తీర్మానాలకు అరబ్ దేశాల న్యాయశాఖ మంత్రులకు అందజేస్తారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









