భారత్లో కరోనా కేసుల వివరాలు
- September 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.సెంకండ్ వేవ్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు.గత కొన్ని రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 30,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. ఇందులో 3,25,60,474 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,42,923 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనా నుంచి 38,303 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 431 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,43,928కి చేరింది. కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ను అందిస్తున్నారు. 24 గంటల్లో భారత్లో 64,51,423 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.దీంతో దేశంలో ఇప్పటి వరకు 76,57,17,137 మందికి టీకాలు వేశారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









