మానవ వనరుల సామర్ధ్య పెంపు లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్
- September 16, 2021
సౌదీ: భవిష్యత్తు ప్రయోజనాలకు అనుగుణంగా కింగ్డమ్ మానవ వనరుల సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు సౌదీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.సౌదీ విజన్ 2030 ప్రణాళికలు, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా పౌరుల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న జాతీయ వ్యూహంలో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజన్ 2030లో భాగంగా 16 వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి 89 కార్యక్రమాలను చేపడుతున్న సౌదీ ప్రభుత్వం...భవిష్యత్తులో మానవ వనరుల కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మానవ వనరుల సామర్ధ్య పెంపు పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ కొత్త కార్యక్రమంలో పటిష్ట విద్యావ్యవస్థ, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ కార్మిక మార్కెట్ కోసం వనరులు సిద్ధం చేయడం, జీవితకాల అభ్యాస అవకాశాలను అందించడం అనే మూడు అంశాలపై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









