మానవ వనరుల సామర్ధ్య పెంపు లక్ష్యంగా కొత్త ప్రాజెక్ట్
- September 16, 2021
సౌదీ: భవిష్యత్తు ప్రయోజనాలకు అనుగుణంగా కింగ్డమ్ మానవ వనరుల సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు సౌదీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.సౌదీ విజన్ 2030 ప్రణాళికలు, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా పౌరుల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న జాతీయ వ్యూహంలో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విజన్ 2030లో భాగంగా 16 వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి 89 కార్యక్రమాలను చేపడుతున్న సౌదీ ప్రభుత్వం...భవిష్యత్తులో మానవ వనరుల కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మానవ వనరుల సామర్ధ్య పెంపు పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ కొత్త కార్యక్రమంలో పటిష్ట విద్యావ్యవస్థ, స్థానికంగా& ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ కార్మిక మార్కెట్ కోసం వనరులు సిద్ధం చేయడం, జీవితకాల అభ్యాస అవకాశాలను అందించడం అనే మూడు అంశాలపై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







