ఎక్స్పో 2020 దుబాయ్: టిక్కెట్ కలిగి, వ్యాక్సిన్ పొందనివారికి ఉచిత పిసిఆర్ టెస్ట్
- September 16, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ విషయంలో కోవిడ్ సేఫ్టీకి ప్రధాన్యతనిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలలపాటు ఈ ఈవెంట్ జరగనుంది. మిలియన్ల సంఖ్యలో విజిటర్స్, ఈ ఎక్స్పోలో పాల్గొనే అవకాశం వుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారు లేదా, వ్యాక్సిన్ పొందకపోతే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (75 గంటల ముందు తీసుకున్న నెగెటివ్ రిజల్ట్ టెస్ట్) తప్పనిసరిగా కలిగి వుండాలి.. 18 ఏళ్ళ వయసు పైబడినవారు ఎక్స్పో సందర్శించాలంటే. సిటీ వ్యాప్తంగా పెద్దయెత్తున టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఆ వివరాల్ని ఎక్స్పో వెబ్సైట్లో పేర్కొంటున్నారు. సందర్శకుల వద్ద ఎక్స్పో టిక్కెట్ వుంటే, ఉచితంగా పిసిఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎక్స్పో మరియు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్ స్టాఫ్కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. వాలంటీర్లు, కాంట్రాక్టర్లు, సర్వీస్ ప్రొవైడర్లు కూడా వ్యాక్సినేషన్ పొందాల్సిందే. ఇండోర్ అలాగే ఔట్ డోర్ వెన్యూలలో ఫేస్ మాస్కులు తప్పనిసరి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వుంటుంది. శానిటైజేషన్ స్టేషన్లనూ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్









