ఐపీఎల్ టికెట్ ధ‌ర Dh 200..ప‌రిమిత సంఖ్య‌లోనే అనుమ‌తి

- September 17, 2021 , by Maagulf
ఐపీఎల్ టికెట్ ధ‌ర Dh 200..ప‌రిమిత సంఖ్య‌లోనే అనుమ‌తి

యూఏఈ: ప్ర‌పంచంలోనే అతి ఖ‌రీదైన‌ టీ-ట్వంటీ లీడ్ ఐపీఎల్ కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. సెకండ్ ఫేజ్ కోసం దుబాయ్, అబుధాబి, షార్జా వేదిక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. తొలి మ్యాచ్ ముంబై, చెన్నై మ‌ధ్య ఈ నెల 19న దుబాయ్ లో జ‌ర‌గబోతోంది. అయితే..కోవిడ్ తో కొన్ని నెల‌లుగా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ ను ఆస్వాదించ‌లేక‌పోతున్న క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ సారి మాత్రం పండగే పండ‌గ‌. ప‌ర‌మిత సంఖ్య‌లో అభిమానులను అనుమ‌తించ‌టంతో ఇక టికెట్ల బుకింగ్ సంద‌డి షురు అయ్యింది. ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com లో మ్యాచ్ టిక్కెట్ల అమ్మ‌కం ఇప్ప‌టికే ప్రారంభం అయ్యింది.  PlatinumList.net లో కూడా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే..అబుధాబితో పోలిస్తే దుబాయ్‌, షార్జాలో టికెట్ రేట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. బిగ్ టీమ్స్ ఆడే మ్యాచ్ ల‌కు టికెట్ల రేట్ల‌ను 200 దిర్హామ్ లుగా నిర్ధారించారు. దుబాయ్‌, షార్జాలో జ‌రిగే మ్యాచ్ ల‌న్నింటికి క‌నీస టికెట్ ధ‌ర Dh 200గా ఉంది. అయితే..అబుధాబిలో మాత్రం మూడింత‌లు త‌క్కువ ధ‌ర‌తో టికెట్ కొనుగోలు చేయ‌వ‌చ్చు. అబుధాబిలో జ‌రిగే మ్యాచ్ ల‌కు క‌నీస టికెట్ ధ‌ర‌ను Dh 60గా నిర్ధారించారు.

అయితే...కోవిడ్ నేప‌థ్యంలో స్టేడియానికి వ‌చ్చే ఫ్యాన్స్ కు కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశారు అధికారులు. 16 ఏళ్ల‌లోపు వ‌య‌సు వారిని స్టేడియంలోకి అనుమ‌తించ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 16 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఖ‌చ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాల‌ని, విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్లైతే స్థానిక ప్ర‌భుత్వం అనుమ‌తించిన వ్యాక్సిన్ పొంది ఉండ‌టంతో పాటు..పీసీఆర్ రిపోర్ట్ ను కూడా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇక కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం టికెట్ల‌ను మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధ‌రించాల‌న్నారు. ప‌రిమిత సంఖ్య‌లోనే అభిమానుల‌ను అనుమ‌తిస్తున్నందున ముందుగానే టికెట్ల‌ను బుక్ చేసుకుంటే ఉత్త‌మం. సెక్యూరిటీ చెక్ లు ఉంటాయి క‌నుక మ్యాచ్  ప్రారంభానికి ముందుగానే స్టేడియానికి చేకోవాల‌ని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com