ప్రయాణికుల పరిమితి సంఖ్యను పెంచాలని కోరిన DGCA
- September 18, 2021
కువైట్: దేశంలోకి అనుమతించే ప్రయాణికుల పరిమిత సంఖ్యను మరింతగా పెంచాలని కైవైట్ మంత్రిమండలిని ఆ దేశ పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కోరారు. ప్రస్తుతం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ వచ్చేందుకు ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నారని..దీంతో లిమిటెడ్ ఫ్లైట్ సర్వీసులపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. టికెట్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా ఈజిప్ట్, ఇండియా నుంచి వచ్చే వారు ఎక్కువ ధరకు టికెట్లను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. అంతేకాదు..పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్న కారణంగా కువైట్ విమానయాన సంస్థలు కొత్త ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించలేకపోతున్నాయని కూడా వివరించింది. ఈ పరిస్థితులను అదిగమించేందుకు దేశంలోకి అనుమతిస్తున్న పరిమిత సంఖ్యను పెంచాలని డీజీసీఏ కోరింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







