అనుమతి లేని పెర్ఫ్యూమ్ కంపెనీలో సోదాలు..52,000 మెటీరియల్ సీజ్
- September 18, 2021
సౌదీ: ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కాస్మోటిక్స్ తయారీ కేంద్రాలపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ తమ దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రఫా గవర్నరేట్లోని ఒక రెస్ట్ హౌస్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెర్ఫ్యూమ్ తయారీకి వినియోగించే 52,000 మెటిరీయల్ ను సీజ్ చేశారు. సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగించడానికి అనుమతించని ఉత్పత్తులతో పాటుగా రసాయనాలు, సింథటిక్ ఆయిల్ ఉత్పత్తులు ఉన్నాయని అన్నారు. సీజ్ చేసిన వాటిలో సింథటిక్ ఆయిల్ 17,500 డబ్బాలు, ఖాళీ కంటైనర్లు, 30,000 స్టిక్కర్లు, 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ చట్టాల మేరకు తగిన అనుమతులు లేకుండా కాస్మోటిక్స్ ఉత్పత్తులను తయారు చేయటం, మార్కెటింగ్ చేయటం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి ఐదు మిలియన్ రియాల్ల వరకు జరిమానా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. చట్ట ఉల్లంఘునుల వివరాలు తెలిసిన పౌరులు యూనిఫైడ్ నంబర్ 19999 కు కాల్ చేసి తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







