వెల్ఫేర్‌ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు

- March 16, 2016 , by Maagulf
వెల్ఫేర్‌ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు

దేశవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్‌ గ్రూప్‌ సంస్థ కార్యాలయాలపై సీబీఐ ఈరోజు దాడులు నిర్వహించింది. విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్‌ సంస్థ చిట్‌ఫండ్‌ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా 82 కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. ఝార్ఖండ్‌ కోర్టు ఆదేశాలతో ఈ సంస్థపై గతంలోనే సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. మల్ల విజయప్రసాద్‌ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com