స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్
- September 20, 2021ఒమన్: కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ..తాజా క్రీడాప్రియులకు కూడా శుభవార్త అందించింది. దేశంలో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో ఏదైన ఒక వ్యాక్సిన్ను కనీసం సింగిల్ డోస్ అయిన తీసుకున్న వారినే అనుమతించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈవెంట్ వేదిక సామర్ధ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని తెలిపింది.
ఇదిలా ఉంటే...ఇరాన్, ఇరాక్ నుంచి ఒమన్ వచ్చే వారికి సంబంధించి క్వారంటైన్ నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ప్రయాణికులను సెప్టెంబర్ 1 నుంచే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినా..ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చే వారు మాత్రం క్వారంటైన్ లో ఉండాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా నిబంధనలను సడలిస్తూ ఇతర దేశాల ప్రయాణికులకు వర్తించిన నిబంధనలే ఈ రెండు దేశాలకు కూడా వర్తిస్తాయని ఒమన్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు