స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్
- September 20, 2021
ఒమన్: కోవిడ్ పరిస్థితుల తర్వాత ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్న సుప్రీం కమిటీ..తాజా క్రీడాప్రియులకు కూడా శుభవార్త అందించింది. దేశంలో స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లలో ఏదైన ఒక వ్యాక్సిన్ను కనీసం సింగిల్ డోస్ అయిన తీసుకున్న వారినే అనుమతించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈవెంట్ వేదిక సామర్ధ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని తెలిపింది.
ఇదిలా ఉంటే...ఇరాన్, ఇరాక్ నుంచి ఒమన్ వచ్చే వారికి సంబంధించి క్వారంటైన్ నిబంధనలను కూడా సడలించింది. విదేశీ ప్రయాణికులను సెప్టెంబర్ 1 నుంచే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చినా..ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చే వారు మాత్రం క్వారంటైన్ లో ఉండాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడా నిబంధనలను సడలిస్తూ ఇతర దేశాల ప్రయాణికులకు వర్తించిన నిబంధనలే ఈ రెండు దేశాలకు కూడా వర్తిస్తాయని ఒమన్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







