రష్యా యూనివర్సిటీలో కాల్పులు..8 మంది మృతి
- September 20, 2021
మాస్కో: రష్యాలో పార్లమెంట్ ఎన్నికల వేళ రక్తం పారింది. ఆ దేశానికి చెందిన పెర్మ్ నగరంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన జరిగింది. ఇది అత్యంత ఓల్డ్ యూనివర్సిటీ. వీలైతే క్యాంప్ను వదిలి వెళ్లండి లేదా రూమ్ల్లోనే తాళాలు వేసుకుని ఉండాలని ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఓ అలర్ట్ ఇచ్చింది. పెర్మ్ నగరంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 8 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









