రష్యా యూనివర్సిటీలో కాల్పులు..8 మంది మృతి
- September 20, 2021మాస్కో: రష్యాలో పార్లమెంట్ ఎన్నికల వేళ రక్తం పారింది. ఆ దేశానికి చెందిన పెర్మ్ నగరంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఓ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన జరిగింది. ఇది అత్యంత ఓల్డ్ యూనివర్సిటీ. వీలైతే క్యాంప్ను వదిలి వెళ్లండి లేదా రూమ్ల్లోనే తాళాలు వేసుకుని ఉండాలని ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఓ అలర్ట్ ఇచ్చింది. పెర్మ్ నగరంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 8 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్