ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- May 09, 2024
దోహా: 'గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) గ్రాండ్ టూర్స్ వీసా' మల్టీ ఎంట్రీ వీసాగా పని చేస్తుంది. ఇది ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ మరియు బహ్రెయిన్ అనే ఆరు జిసిసి దేశాలలో ప్రయాణీకులను స్వేచ్ఛగా వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తుంది. వీసాలో చేర్చబడిన దేశాలలో 30 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపవచ్చు. ఈ వ్యవస్థను 2024 చివరి నాటికి అమలులోకి తీసుకురానున్నారు. షార్జా కామర్స్ అండ్ టూరిజం అథారిటీ (SCTDA) ఖలీద్ జాసిమ్ అల్ మిద్ఫా సోమవారం అరేబియా ట్రావెల్ మార్కెట్లో ఈ మేరకు ప్రకటించారు. “ఈ సంవత్సరం చివరి నాటికి, మొత్తం వ్యవస్థ అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం నిరంతరంగా పనిచేస్తున్నం. ఇ-సేవ దానిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు సానుకూల ఫలితాన్ని చూపుతుంది.’’ అని పేర్కొన్నారు.
GCC దేశాల పౌరులకు గల్ఫ్ దేశాల మధ్య వీసా-రహిత ప్రయాణం ఇప్పటికే అమలులో ఉంది. అయితే, ఈ కొత్త GCC గ్రాండ్ టూర్స్ వీసా దేశాలలో నివసిస్తున్న ప్రవాసులకు సరిహద్దుల మధ్య ఉచిత పాస్గా పని చేస్తుంది. ఇది మరింత స్వేచ్ఛను పెంచుతుంది. ప్రయాణం మరియు GCC దేశాల పర్యాటకం మరియు ఆర్థిక వ్యవస్థలను పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగాలలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









