ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- May 09, 2024
దోహా: 'గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) గ్రాండ్ టూర్స్ వీసా' మల్టీ ఎంట్రీ వీసాగా పని చేస్తుంది. ఇది ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ మరియు బహ్రెయిన్ అనే ఆరు జిసిసి దేశాలలో ప్రయాణీకులను స్వేచ్ఛగా వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తుంది. వీసాలో చేర్చబడిన దేశాలలో 30 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపవచ్చు. ఈ వ్యవస్థను 2024 చివరి నాటికి అమలులోకి తీసుకురానున్నారు. షార్జా కామర్స్ అండ్ టూరిజం అథారిటీ (SCTDA) ఖలీద్ జాసిమ్ అల్ మిద్ఫా సోమవారం అరేబియా ట్రావెల్ మార్కెట్లో ఈ మేరకు ప్రకటించారు. “ఈ సంవత్సరం చివరి నాటికి, మొత్తం వ్యవస్థ అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం నిరంతరంగా పనిచేస్తున్నం. ఇ-సేవ దానిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు సానుకూల ఫలితాన్ని చూపుతుంది.’’ అని పేర్కొన్నారు.
GCC దేశాల పౌరులకు గల్ఫ్ దేశాల మధ్య వీసా-రహిత ప్రయాణం ఇప్పటికే అమలులో ఉంది. అయితే, ఈ కొత్త GCC గ్రాండ్ టూర్స్ వీసా దేశాలలో నివసిస్తున్న ప్రవాసులకు సరిహద్దుల మధ్య ఉచిత పాస్గా పని చేస్తుంది. ఇది మరింత స్వేచ్ఛను పెంచుతుంది. ప్రయాణం మరియు GCC దేశాల పర్యాటకం మరియు ఆర్థిక వ్యవస్థలను పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగాలలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







