ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- May 09, 2024
దోహా: 'గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) గ్రాండ్ టూర్స్ వీసా' మల్టీ ఎంట్రీ వీసాగా పని చేస్తుంది. ఇది ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ మరియు బహ్రెయిన్ అనే ఆరు జిసిసి దేశాలలో ప్రయాణీకులను స్వేచ్ఛగా వచ్చి వెళ్లేందుకు అనుమతిస్తుంది. వీసాలో చేర్చబడిన దేశాలలో 30 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపవచ్చు. ఈ వ్యవస్థను 2024 చివరి నాటికి అమలులోకి తీసుకురానున్నారు. షార్జా కామర్స్ అండ్ టూరిజం అథారిటీ (SCTDA) ఖలీద్ జాసిమ్ అల్ మిద్ఫా సోమవారం అరేబియా ట్రావెల్ మార్కెట్లో ఈ మేరకు ప్రకటించారు. “ఈ సంవత్సరం చివరి నాటికి, మొత్తం వ్యవస్థ అమల్లోకి వస్తుంది. దీని అమలు కోసం నిరంతరంగా పనిచేస్తున్నం. ఇ-సేవ దానిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు సానుకూల ఫలితాన్ని చూపుతుంది.’’ అని పేర్కొన్నారు.
GCC దేశాల పౌరులకు గల్ఫ్ దేశాల మధ్య వీసా-రహిత ప్రయాణం ఇప్పటికే అమలులో ఉంది. అయితే, ఈ కొత్త GCC గ్రాండ్ టూర్స్ వీసా దేశాలలో నివసిస్తున్న ప్రవాసులకు సరిహద్దుల మధ్య ఉచిత పాస్గా పని చేస్తుంది. ఇది మరింత స్వేచ్ఛను పెంచుతుంది. ప్రయాణం మరియు GCC దేశాల పర్యాటకం మరియు ఆర్థిక వ్యవస్థలను పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగాలలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి గల్ఫ్ దేశాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







