'దృశ్యం 2' సెన్సార్ పూర్తి
- September 20, 2021హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక వెంకటేష్ కూడా మోహన్లాల్ నటించిన అప్పటి సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని అదే టైటిల్తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎపుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్గా థియేట్రికల్ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు U/A జారీ సర్టిఫికేట్ చేసారు. దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను డిస్నీ+హాట్స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..