తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- September 20, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు తాగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 208 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 220 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,63,662 కు చేరగా… రికవరీ కేసులు 6,54,765 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,906 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 45,274 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com