వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతించండి..ఎయిర్ లైన్స్ కు సౌదీ ఆదేశాలు
- September 21, 2021
సౌదీ: కోవిడ్ నిబంధనలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం..ఇతర దేశాల నుంచి వచ్చే వారితో ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సౌదీ వచ్చే ప్రయాణికుల ఇమ్యూనిటీ స్థాయిని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్లైట్లోకి అనుమతించాలని ఆదేశించింది. ఇమ్యూనిటీ స్థాయిలను నిర్ధారించుకోవటం అంటే వారు వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తనిఖీ చేయటమే. ఇందుకు రెండు విధానాలను అనుసరించాలని కూడా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్..సౌదీకి విమానాలను నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తవక్కల్న యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉన్నావారిని, లేదా ఖూదూమ్ ఆన్ లైన్ ఫ్లాట్ ద్వారా వ్యాక్సిన్ పొందినట్లు నిర్ధారించే సర్టిఫికెట్లను సమర్పించిన వారినే అనుమతించాలని..ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









