కువైట్ విడిచి వెళ్లిన 8461 మంది రెస్టారెంట్ రంగంలోని కార్మికులు

- September 22, 2021 , by Maagulf
కువైట్ విడిచి వెళ్లిన 8461 మంది రెస్టారెంట్ రంగంలోని కార్మికులు

కువైట్: కువైట్లోని రెస్టారెంట్ రంగం సిబ్బంది కొర‌త‌ను ఎదుర్కొంటోంది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 8641 మంది సిబ్బంది కువైట్ విడిచి వెళ్లారు. గ‌తేడాది మార్చి 2020 నుంచి ఈ ఏడాది మార్చి 2021 మ‌ధ్య కాలంలోనే వేల సంఖ్య‌లో సిబ్బంది దేశం విడిచి వెళ్లారు. దీనికి తోడు కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా విదేశీల‌ రాక‌పై నిషేధం కొన‌సాగ‌టం కూడా సిబ్బంది నియామ‌కాల‌కు అడ్డంకిగా మారింది. దీంతో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొర‌త తీవ్ర‌తరం అయ్యింది. ఈ ప‌రిణామాల కార‌ణంగా రెస్టారెంట్ రంగంలోని వ‌ర్క‌ర్ల‌కు రెట్టింపు జీతాలు ఇచ్చి తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి రెస్టారెంట్ రంగంలో సేవ‌లు అందించే స్థాయిలో స్థానికుల‌కు శిక్ష‌ణ లేద‌ని, వారికి ఇప్ప‌టికిప్పుడు ఆ స్థాయి శిక్ష‌ణ ఇవ్వ‌టం కూడా సాధ్యం కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com