దుబాయ్ లో ఛారిటీ క్రికెట్ మ్యాచ్
- September 26, 2021
దుబాయ్: వ్యక్థుల ఆర్థిక స్థితిగతులు, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరికీ విద్య అందాలనే సంకల్పంతో జైన్ సేవా మిషన్, ఎకోప్ ఛారిటీ సంయుక్తంగా ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రత్యేకావసరాలుగల పిల్లలు, యంగ్ అడల్ట్స్ విద్య కోసం ఈ ఛారిటీ కార్యక్రమాలు పని చేయనున్నాయి. 5000 మంది సభ్యులుగల జైన్ సేవా సమితితో ఎకోప్ చేతులు కలిపింది. ఎకోప్, విమెన్ మరియు బాలికల ఉన్నతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి ఛారిటీ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఐదుగురు స్పాన్సర్స్, 60 మంది ఆటగాళ్ళు, ఆరు టీములతో ఈ పోటీలు జరుగుతాయి. గుజరాత్లోని శ్రీ రాజ్ సౌభాగ్ ఆషీర్వాద్ ట్రస్ట్ ఫర్ డిజేబుల్డ్, రాష్ట్రీయ ప్రగ్యా ద్రిష్టి సంస్థాన్ - ఢిల్లీ, పెహ్చాన్ - ది సీక్రెట్ స్కూల్ ఢిల్లీ - ఎన్సీఆర్, తదితర సంస్థలకు చేయూతనిచ్చేందుకు జైన్ సేవా మిషన్ - ఎకోప్ ఛారిటీ కలిసి పనిచేస్తున్నాయి. echopecharity@gmail ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.




తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







