దుబాయ్ లో ఛారిటీ క్రికెట్ మ్యాచ్
- September 26, 2021
దుబాయ్: వ్యక్థుల ఆర్థిక స్థితిగతులు, సామర్థ్యాలతో సంబంధం లేకుండా అందరికీ విద్య అందాలనే సంకల్పంతో జైన్ సేవా మిషన్, ఎకోప్ ఛారిటీ సంయుక్తంగా ఓ సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రత్యేకావసరాలుగల పిల్లలు, యంగ్ అడల్ట్స్ విద్య కోసం ఈ ఛారిటీ కార్యక్రమాలు పని చేయనున్నాయి. 5000 మంది సభ్యులుగల జైన్ సేవా సమితితో ఎకోప్ చేతులు కలిపింది. ఎకోప్, విమెన్ మరియు బాలికల ఉన్నతికి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలూ కలిసి ఛారిటీ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఐదుగురు స్పాన్సర్స్, 60 మంది ఆటగాళ్ళు, ఆరు టీములతో ఈ పోటీలు జరుగుతాయి. గుజరాత్లోని శ్రీ రాజ్ సౌభాగ్ ఆషీర్వాద్ ట్రస్ట్ ఫర్ డిజేబుల్డ్, రాష్ట్రీయ ప్రగ్యా ద్రిష్టి సంస్థాన్ - ఢిల్లీ, పెహ్చాన్ - ది సీక్రెట్ స్కూల్ ఢిల్లీ - ఎన్సీఆర్, తదితర సంస్థలకు చేయూతనిచ్చేందుకు జైన్ సేవా మిషన్ - ఎకోప్ ఛారిటీ కలిసి పనిచేస్తున్నాయి. echopecharity@gmail ద్వారా ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.




తాజా వార్తలు
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి







