దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొంటున్న 15 భారత రాష్ట్రాలు, 9 ఫెడరల్ మినిస్ట్రీలు..
- September 27, 2021
న్యూ ఢిల్లీ: భారతదేశానికి చెందిన 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియన్ పెవిలియన్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. తమ తమ బృందాలతో ఆయా రాష్ట్రాలు, మినిస్ట్రీలు పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. తమ సాంస్కృతిక అంశాలు, ఫుడ్ మరియు వ్యాపార అవకాశాలను ఇండియన్ పెవిలియన్ వద్ద ప్రదర్శనకు వుంచుతారు. తొమ్మిది మినిస్ట్రీలు, డిపార్టుమెంట్లు కూడా ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇదో అద్భుతమైన వేదిక అని భారత ప్రతినిథులు పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో తాము కూడా అతి పెద్ద భాగస్వాముల్లో ఒకరమని వివరించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కమీషనర్ జనరల్ ఇండియా డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ, ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







