దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొంటున్న 15 భారత రాష్ట్రాలు, 9 ఫెడరల్ మినిస్ట్రీలు..
- September 27, 2021
న్యూ ఢిల్లీ: భారతదేశానికి చెందిన 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియన్ పెవిలియన్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. తమ తమ బృందాలతో ఆయా రాష్ట్రాలు, మినిస్ట్రీలు పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నాయి. తమ సాంస్కృతిక అంశాలు, ఫుడ్ మరియు వ్యాపార అవకాశాలను ఇండియన్ పెవిలియన్ వద్ద ప్రదర్శనకు వుంచుతారు. తొమ్మిది మినిస్ట్రీలు, డిపార్టుమెంట్లు కూడా ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఇదో అద్భుతమైన వేదిక అని భారత ప్రతినిథులు పేర్కొన్నారు. ఈ ఎక్స్పోలో తాము కూడా అతి పెద్ద భాగస్వాముల్లో ఒకరమని వివరించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్, డిప్యూటీ కమీషనర్ జనరల్ ఇండియా డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ, ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









