దుబాయ్ ఎక్స్ పో-2020, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్
- September 29, 2021
దుబాయ్: అక్టోబర్ 1 న ప్రారంభమయ్యే దుబాయ్ ఎక్స్ పో-2020 కోసం జనమంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎక్స్ పో చూసేందుకు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు.దీంతో హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. దుబాయ్ ఎక్స్ పో లో ప్రపంచంలోని 192 కంట్రీస్ కి సంబంధించిన విశేషాలు, ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్స్ రుచులను అందుబాటులో పెట్టనున్నారు. దాదాపు 60 లైవ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ పో లలో ఇదొక్కటి.
మంత్లీ పాస్ ఒక్కరోజులో ఈ ఎక్స్ పో చూడటం సాధ్యం కాదు. ఆ రేంజ్ లో ప్రపంచ విశేషాలు ఇందులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ పో ను తనివితీరా చూడాలనుకునే వారికోసం దుబాయ్ అధికారులు మొత్తం నెల రోజుల పాస్ తీసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా ఒక్క రోజుకి 95 దిర్హామ్ లు నిర్ణయించారు. ఎన్ని రోజులు కావాలనుకునే వారు అన్ని రోజులకు సరిపడ టిక్కెట్ తీసుకోవచ్చు. మొత్తం నెల రోజుల కోసం మంత్ పాస్, ఆరు నెలల పాస్ తీసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. అక్టోబర్ 15 వరకు టిక్కెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
18 ఏళ్ల లోపు వారికి ఫ్రీ
ఈ ఎక్స్ పో 18 ఏళ్ల లోపు వారికి, హైయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కి కూడా ఉచితం. ఇక అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ వచ్చే వారికి ఫ్రీ గా ఒక్క పాస్ ఇవ్వనున్నారు. దుబాయ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే ప్యాసింజర్స్ కు కూడా ఫ్రీ గా పాస్ ఇవ్వనున్నారు.
సింగిల్ టిక్కెట్ల ధరలు
సింగిల్ ఎంట్రీ-95 దిర్హామ్స్.
సిక్స్ మంత్స్ సీజన్ పాస్ -495 దిర్హామ్
మల్టీ డే పాస్ – 195 దిర్హామ్ ( 30 రోజుల పాటు ఎంట్రీ)
ఎక్స్ పో టిక్కెట్లను దుబాయ్ ఆన్ లైన్ టిక్కెట్ ఆఫీస్ ద్వారా, దుబాయ్ లోని మెట్రో స్టేషన్లు, ఇనాక్, సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









