కోవీషీల్డ్ టీకాకు ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా
- October 01, 2021
కోవీషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులు ఇక నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఇండియన్లకు ఊరటనిచ్చింది. కోవీషీల్డ్తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేయనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికులు రావచ్చు అంటూ ఇవాళ ఆ దేశం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై గత 18 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఆస్ట్రేలియా ఎత్తివేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







