జెద్దా పోర్ట్ లో కప్టగాన్ ట్యాబ్లెట్ల స్మగ్లింగ్...స్మగ్లర్ల అరెస్ట్

- October 02, 2021 , by Maagulf
జెద్దా పోర్ట్ లో కప్టగాన్ ట్యాబ్లెట్ల స్మగ్లింగ్...స్మగ్లర్ల అరెస్ట్

సౌదీ: జెద్దా పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న 12 మిలియన్ల కప్టగాన్ ట్యాబెట్ల ను కస్టమ్స్ అథారిటీ అధికారులు పట్టుకున్నారు. ఓడరేవులో కొన్ని సరుకులను పంపిస్తూ అందులో ఈ ట్యాబెట్లను స్మగ్లర్లు ఉంచారు. వేరే సరుకులో వీటిని పెట్టి స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే కచ్చితమైన సమాచారం అందటంతో అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ సరుకు ఎవరికైతే చేరనుందో వారిని అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ నేరాలు చేసే వారికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తమతో కచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని పోర్ట్ అధికారులు కోరారు.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com