ట్రావెల్ ఆంక్షలను సడలించనున్న సౌదీ
- October 06, 2021
రియాద్: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ట్రావెల్ ఆంక్షలను తగ్గించాలని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వ్యాప్తి గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. దీంతో ట్రావెల్ ఆంక్షలను సులభం చేయాలని నిర్ణయించారు. సౌదీ లో వచ్చే వారు 14 రోజుల పాటు ముందే క్వారంటైన్ లో ఉండాలని ఇప్పటి వరకు ఉన్న నిబంధనను తొలగించనున్నారు. స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, టీచర్లు, యూనివర్సిటీస్ స్టూడెంట్స్, టెక్నికల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వీళ్లంతా సౌదీకి వచ్చాక ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. ఇక సౌదీలోనే రెండు డోస్ లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇస్తామని అధికారులు తెలిపారు. బహ్రయిన్ కు చెందిన 18 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదన్న నిబంధనను కూడా ఎత్తివేయనున్నారు. ఇక సౌదీకి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా హెల్త్ డిపార్ట్ మెంట్ సూచించిన అన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







