ట్రావెల్ ఆంక్షలను సడలించనున్న సౌదీ
- October 06, 2021
రియాద్: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ట్రావెల్ ఆంక్షలను తగ్గించాలని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వ్యాప్తి గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. దీంతో ట్రావెల్ ఆంక్షలను సులభం చేయాలని నిర్ణయించారు. సౌదీ లో వచ్చే వారు 14 రోజుల పాటు ముందే క్వారంటైన్ లో ఉండాలని ఇప్పటి వరకు ఉన్న నిబంధనను తొలగించనున్నారు. స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, టీచర్లు, యూనివర్సిటీస్ స్టూడెంట్స్, టెక్నికల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వీళ్లంతా సౌదీకి వచ్చాక ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. ఇక సౌదీలోనే రెండు డోస్ లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇస్తామని అధికారులు తెలిపారు. బహ్రయిన్ కు చెందిన 18 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదన్న నిబంధనను కూడా ఎత్తివేయనున్నారు. ఇక సౌదీకి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా హెల్త్ డిపార్ట్ మెంట్ సూచించిన అన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







