ట్రావెల్ ఆంక్షలను సడలించనున్న సౌదీ
- October 06, 2021
రియాద్: కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ట్రావెల్ ఆంక్షలను తగ్గించాలని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వ్యాప్తి గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిందని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. దీంతో ట్రావెల్ ఆంక్షలను సులభం చేయాలని నిర్ణయించారు. సౌదీ లో వచ్చే వారు 14 రోజుల పాటు ముందే క్వారంటైన్ లో ఉండాలని ఇప్పటి వరకు ఉన్న నిబంధనను తొలగించనున్నారు. స్టూడెంట్స్, ప్రొఫెసర్లు, టీచర్లు, యూనివర్సిటీస్ స్టూడెంట్స్, టెక్నికల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వీళ్లంతా సౌదీకి వచ్చాక ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాలి. ఇక సౌదీలోనే రెండు డోస్ లు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇస్తామని అధికారులు తెలిపారు. బహ్రయిన్ కు చెందిన 18 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదన్న నిబంధనను కూడా ఎత్తివేయనున్నారు. ఇక సౌదీకి వచ్చే ప్రయాణికులంతా కచ్చితంగా హెల్త్ డిపార్ట్ మెంట్ సూచించిన అన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









