లీగల్ స్టేటస్ సరిచేసుకునేందుకు గడువు పెంపు
- October 08, 2021
ఖతార్: వీసా నిబంధనలు ఉల్లంఘించి ఖతార్ లో నివాసం ఉంటున్న ప్రవాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా తమ లీగల్ స్టేటస్ ను సరిచేసుకోవాలని కోరింది. ఇందుకు సంబంధించి గ్రేస్ పీరియడ్ ను పొడగించింది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు అవకాశం కల్పించింది. ఉద్యోగులు, వర్కర్స్, రెసిడెంట్స్ ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ ఖతార్ లో ఉంటున్నారో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
సర్వీస్ సెంటర్లు ఏర్పాటు
ప్రవాసులు తమ లీగల్ స్టేటస్ ను సరిచేసుకునేందుకు అంతర్గత వ్యవహరాల శాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. అదే విధంగా ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్ సలాల్, ఉమ్ సునాయిమ్ (ఇండస్ట్రీయల్ ఏరియా), మిసామియర్, అల్ వక్ర, అల్ రయ్యన్ లో సర్వీస్ సెంటర్లు ప్రత్యేకంగా ఓపెన్ చేశారు. లీగల్ స్టేటస్ సరిచేసుకునే అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ సంప్రదించవచ్చు. ఖతార్ లో చాలా దేశాల ప్రజలు ఉండటంతో వారికి అర్థమయ్యే విధంగా అరబ్, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళం, తమిళ్, బంగ్లా, నేపాల్ భాషల్లో ఈ సమాచారాన్ని ప్రభుత్వం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







