దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం
- October 10, 2021దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం ను తీసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వారందరికీ ఒకే చోట ఇళ్లు, స్థలాలను ఇవ్వనుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడైతే ఉంటారో అదే ప్రాంతంలో అర్హులకు నివాస స్థలం కేటాయించనున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అంతా ఒక దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో దుబాయ్ ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ రాజకుమారుడు, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రాంట్లు, భూమి, హౌసింగ్ యూనిట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన అన్నారు. " దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఒకే ఫ్యామిలీకి ఒకే ప్రాంతంలో నివాస స్థలాన్ని కేటాయించటానికి ప్రాధాన్యత ఇస్తాం. "అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?