దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం
- October 10, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం ను తీసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వారందరికీ ఒకే చోట ఇళ్లు, స్థలాలను ఇవ్వనుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడైతే ఉంటారో అదే ప్రాంతంలో అర్హులకు నివాస స్థలం కేటాయించనున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అంతా ఒక దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో దుబాయ్ ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ రాజకుమారుడు, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రాంట్లు, భూమి, హౌసింగ్ యూనిట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన అన్నారు. " దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఒకే ఫ్యామిలీకి ఒకే ప్రాంతంలో నివాస స్థలాన్ని కేటాయించటానికి ప్రాధాన్యత ఇస్తాం. "అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







