భారత్ కరోనా అప్డేట్
- October 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి.ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. 20వేల మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 193 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 209 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్రం తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,782 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 21,563 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,93,478 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98శాతానికి పెరగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్







