మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం

- October 12, 2021 , by Maagulf
మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం

మక్కా: మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ రెండు పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసే జనరల్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో  155 ట్యాంకులు, గ్రాండ్ మసీదులో 20,000 కంటైనర్ల ద్వారా జంజామ్ నీటిని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో టీకాలు వేయడం,  ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు, భక్తుల నిబద్ధత కారణంగా ప్రజలు నీటిని  తిరిగి పొందడానికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెన్సీ అధికారుల ప్రకారం.. గ్రాండ్ మసీదులో జంజామ్ నీటి సగటు రోజువారీ వినియోగం 1,633,030 క్యూబిక్ మీటర్లు కాగా.. జంజాం నీటి వ్యవస్థలను 126 మంది పర్యవేక్షిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com