నేపాల్‌లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి

- October 12, 2021 , by Maagulf
నేపాల్‌లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి

ఖాట్మండు:నేపాల్‌లోని ముగు జిల్లాలో మంగళవారం ఒక ప్రయాణికుల బస్సు నదిలో పడిన దుర్ఘటనలో 28 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.నేపాల్‌గంజ్‌ నుండి ముగు జిల్లా కేంద్రమైన గంగాధికి బస్సు వెళుతుండగా బస్సు పినా ఝ్యారీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు వెళ్లే ప్రయాణికులు పలువురు ఈ బస్సులో వున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్‌ సైనిక విమానం రంగంలోకి దిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com