నార్వేలో బాణాలతో దాడి, ఐదుగురు మృతి
- October 14, 2021నార్వే : ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోంగ్స్ బెర్గ్ పట్టణంలో ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాద కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడిలో ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు 37ఏళ్ల డానిష్ పౌరుడనీ పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇతను కోంగ్స్ బెర్గ్ లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న మహిళ అక్కడి మీడియాతో మాట్లాడింది. వీపు భాగంలో బాణాలు పెట్టుకొని చేతులో విల్లుపట్టుకున్న వ్యక్తి విచక్షణ రహితంగా బాణాలు విసిరాడని.. దీంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి