తైవాన్లో భారీ అగ్నిప్రమాదం, 46 మంది మృతి
- October 14, 2021తైవాన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.కాహ్సియుంగ్ నగరంలోని 13 అంతస్తుల ఓ భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం(అక్టోబర్ 14) తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో తమకు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు కొందరు వెల్లడించారు.ప్రమాద కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.ప్రమాద సమయంలో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.
అగ్నిప్రమాద దృశ్యాలు పొరుగునే ఉన్న మరో బిల్డింగ్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాని ప్రకారం... మొదట ఆ భవనం మొదటి అంతస్తులోనే మంటలు చెలరేగాయి.ఆ తర్వాత క్షణాల్లోనే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3గం. సమయంలో ఫైర్ సిబ్బందికి ప్రమాదంపై సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలో మొత్తం 120 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 46 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. మిగతావారి పరిస్థితేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం