పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.!
- October 14, 2021
గోవా: దేశ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, డ్రోన్ల ద్వారా దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడటం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మరోసారి సర్జికల్ స్టైక్స్ చేయాల్సి వస్తుందని చెప్పారు. తమ పౌరులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని అన్నారు. గోవాలోని ధర్బందోరాలో జరిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







