మక్కా, మదీనా మసీదులలో కోవిడ్ నిబంధనలు ఎత్తివేత
- October 16, 2021
సౌదీ అరేబియా: రోజువారి కరోనా కేసులు తగ్గడంతో ఇకపై మక్కా, మదీనా మసీదులలో పూర్తి సామర్థ్యంతో భక్తులను అనుమతించనున్నారు. మాస్క్ ధరించి, ఉమ్రా ట్రాకింగ్ యాప్ని ఉపయోగిస్తూ మసీదును భక్తులు సందర్శించవచ్చు. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 17 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, రవాణా, రెస్టారెంట్లు, సినిమా, ఇతర సమావేశాలు మరోసారి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. సామాజిక దూర నిబంధనలను ఎత్తేశారు. సౌదీ అరేబియాలో కొత్త కరోనావైరస్ కేసులు 350 కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









