దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- October 16, 2021హైదరాబాద్: హైదరాబాద్లో దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం (హైదరాబాద్) డిప్యూటీ పోలీసు కమిషనర్ (DCP) గజరావు భూపాల్ ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రాయీస్ జాబ్రి, ఆదిల్ జాబ్రీ, సయ్యద్ సలేహ్ జాబ్రి, సాద్ బిన్ సలేహ్ జాబ్రి దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేశారు. ప్రధాన నిందితుడు రయీస్ జాబ్రీ దుబాయ్లో పనిచేశాడు. 2019 లో రయీస్ జాబ్రి ఇండియాకు తిరిగి వస్తుండగా.. దుబాయ్ వ్యాపారవేత్త అతనికి తెలియకుండా కిలో బంగారం ఉన్న బ్యాగ్ని దుబాయ్ నుండి భారతదేశంలో డెలివరీ చేయడానికి ఇచ్చాడు. అయితే విమానాశ్రయంలో అతడిని కస్టమ్ అధికారులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో దుబాయ్ వ్యాపారవేత్త తనకు ఆర్థిక సాయం, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని కానీ అలా చేయలేదని, అందుకే దుబాయ్ ఎన్నారై ను కత్తితో పొడిచి చంపామని నిందితుడు రయీస్ విచారణలో చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DCP గజరావు భూపాల్ మాగల్ఫ్ న్యూస్ కు తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి