టీ20 వరల్డ్కప్ సూపర్-12లోకి నమీబియా..
- October 22, 2021
షార్జా: టీ20 వరల్డ్కప్ సూపర్-12కి నమీబియా అర్హత సాధించింది. ఐర్లాండ్తో షార్జా వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన నమీబియా.. ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆడిన మూడు మ్యాచ్లకిగానూ రెండింటిలో ఓడిపోయిన ఐర్లాండ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఎ నుంచి సూపర్-12కి ఇప్పటికే శ్రీలంక అర్హత సాధించగా.. తాజాగా రెండో బెర్తుని నమీబియా దక్కించుకుంది. గ్రూప్- బి నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కి అర్హత సాధించాయి.
మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 8 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఓపెనర్లు స్టిర్లింగ్ (38: 24 బంతుల్లో 5x4, 1x6), కెవిన్ ఓబ్రైన్ (25: 24 బంతుల్లో 2x4) చెప్పుకోదగ్గ స్కోరు చేసినా.. మిడిలార్డర్ తేలిపోయింది. ఎంతలా అంటే ఏకంగా ఏడుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. నమీబియా బౌలర్లలో ప్రైలింక్ మూడు వికెట్లు పడగొట్టగా.. వైసీ రెండు, స్మిత్, స్కూల్జ్ చెరో వికెట్ తీశారు.
126 పరుగుల ఛేదనలో నమీబియా ఓపెనర్లు విలియమ్స్ (15), జెనె గ్రీన్ (24) తక్కువ స్కోరుకే ఔటైనా.. కెప్టెన్ ఎరాస్మస్ (53 నాటౌట్: 49 బంతుల్లో 3x4, 1x6) అజేయ అర్ధశతకంతో జట్టుని గెలిపించాడు. అతనికి చివర్లో డేవిడ్ వైస్ (28 నాటౌట్: 14 బంతుల్లో 1x4, 2x6) చక్కటి సహకారం అందించాడు. దాంతో.. నమీబియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే 126/2తో విజయాన్ని అందుకుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









