దేశ పౌరులు, ప్రవాసులకు కువైట్ హెచ్చరిక!
- October 24, 2021
కువైట్: కువైట్ సమాచార మంత్రిత్వశాఖ దేశ పౌరులు, ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే సందేశాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆగంతకుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎలక్ట్రానిక్ లింక్స్కు స్పందించకపోవడం మంచిదని తెలియజేసింది. మీకు పార్శిల్ వచ్చిందంటూ నివాసితులకు ఇలా సంబంధంలేని లింక్స్ పంపించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మంత్రిత్వశాఖ ఈ అలెర్ట్ జారీ చేసింది.
అందుకే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పార్శిల్ పేరుతో వచ్చే ఎలక్ట్రానిక్ లింక్స్కు నగదు పంపించి మోసపోవద్దని సంబంధిత అధికారులు ప్రవాసులు, దేశ పౌరులను సూచించారు. ఈ మేరకు మంత్రిత్వశాఖ అధికారిక సోషల్ మీడియా వెబ్సైట్స్లో కూడా ప్రత్యేక ప్రకటనలు ఇచ్చింది. ఇలా ఎదైనా అనుమానాస్పద లింక్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరారు. సాధ్యమైనంత వరకు ఈ ఫేక్ మెసేజ్లకు స్పందించవద్దని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







