సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో LED లైట్లు పెట్టాలి..
- October 31, 2021
ఖతార్: సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను పెట్టాలని సిటిజన్స్.. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (Ashghal)ను కోరుతున్నారు. స్థానిక అరబిక్ దినపత్రిక ‘అరేయా’తో పలువురు సిజిటన్స్ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత రోడ్లపై స్పష్టంగా చూసేందుకు పసుపు లైట్ల స్థానంలో LED లైట్లు పెట్టడం ద్వారా కళ్ళకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉన్నందునా ఆర్థికంగా కూడా కలిసివస్తుందని పబ్లిక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జి-రింగ్ రోడ్లోని పాత లైటింగ్ యూనిట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్ట్ ను మొదటగా పూర్తి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. LED లైట్లతో నిర్వహణ ఖర్చులను అలాగే విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ వ్యవస్థతో పోలిస్తే LED లైటింగ్ యూనిట్లు 50-55% శక్తిని ఆదా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రహదారి భద్రతే లక్ష్యంగా వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను అమర్చాలని Ashghal ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







