సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో LED లైట్లు పెట్టాలి..
- October 31, 2021ఖతార్: సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను పెట్టాలని సిటిజన్స్.. పబ్లిక్ వర్క్స్ అథారిటీ (Ashghal)ను కోరుతున్నారు. స్థానిక అరబిక్ దినపత్రిక ‘అరేయా’తో పలువురు సిజిటన్స్ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. సూర్యాస్తమయం తర్వాత రోడ్లపై స్పష్టంగా చూసేందుకు పసుపు లైట్ల స్థానంలో LED లైట్లు పెట్టడం ద్వారా కళ్ళకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, సుదీర్ఘ జీవిత కాలాన్ని కలిగి ఉన్నందునా ఆర్థికంగా కూడా కలిసివస్తుందని పబ్లిక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జి-రింగ్ రోడ్లోని పాత లైటింగ్ యూనిట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ప్రాజెక్ట్ ను మొదటగా పూర్తి చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. LED లైట్లతో నిర్వహణ ఖర్చులను అలాగే విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ వ్యవస్థతో పోలిస్తే LED లైటింగ్ యూనిట్లు 50-55% శక్తిని ఆదా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రహదారి భద్రతే లక్ష్యంగా వివిధ ప్రాంతాలలో సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ లైట్లను అమర్చాలని Ashghal ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు