నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- March 30, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పర్యటనలో భాగంగా పేదల కోసం నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సామూహిక గృహ ప్రవేశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్లను స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.
పేదల భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇళ్లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు సీఎం తెలిపారు. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, సకల వసతులతో కూడిన ఒక సురక్షితమైన కాలనీని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గృహ సముదాయాలు పేదలకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,50,893 కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది పేదలకు గూడు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లయిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!







