నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- March 30, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట పర్యటనలో భాగంగా పేదల కోసం నిర్మించిన టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సామూహిక గృహ ప్రవేశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్లను స్వయంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు.
పేదల భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఇళ్లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు సీఎం తెలిపారు. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా, సకల వసతులతో కూడిన ఒక సురక్షితమైన కాలనీని అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గృహ సముదాయాలు పేదలకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,50,893 కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది పేదలకు గూడు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లయిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









