పవన్ అభిమానుల ఆందోళన..
- March 20, 2016
పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం నోవాటెల్లో గ్రాండ్గా జరగనుంది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానుండడంతో ఈ కార్యక్రమానికి ఎలా అయిన హాజరు కావాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకపోతే పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొనడంతో పవన్ అభిమానులు బ్లడ్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది.కేవలం తెలుగు రాష్ర్టాలనుండే కాక కర్ణాటక, బెంగళూర్ తదితర ప్రాంతాల నుండి తరలి వచ్చిన అభిమానులు తాము లేకుండా ఆడియో ఫంక్షన్ను నిర్వహిస్తారు అని ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి సంఘనలు జరుగుతాయని భావించే పవన్ ఆడియో ఫంక్షన్ను చేయోద్దని నిర్ణయించుకున్నారు. కాని సినిమా ప్రమోషన్కు ఇది తప్పని సరి కాబట్టి నిర్మాతలు గ్రాండ్గా ఏర్పాట్లు చేసారు.అయితే అభిమానులు ఇలా ఆందోళనలకు దిగడంతో నిర్మాత ఆలోచనలో పడ్డారట. మరి ఈ వివాదాన్ని సాయంత్రంలోపు ఏ కొలిక్కి తీసుకొస్తారో చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







