పవన్ అభిమానుల ఆందోళన..
- March 20, 2016
పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం నోవాటెల్లో గ్రాండ్గా జరగనుంది. మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానుండడంతో ఈ కార్యక్రమానికి ఎలా అయిన హాజరు కావాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకపోతే పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొనడంతో పవన్ అభిమానులు బ్లడ్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది.కేవలం తెలుగు రాష్ర్టాలనుండే కాక కర్ణాటక, బెంగళూర్ తదితర ప్రాంతాల నుండి తరలి వచ్చిన అభిమానులు తాము లేకుండా ఆడియో ఫంక్షన్ను నిర్వహిస్తారు అని ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి సంఘనలు జరుగుతాయని భావించే పవన్ ఆడియో ఫంక్షన్ను చేయోద్దని నిర్ణయించుకున్నారు. కాని సినిమా ప్రమోషన్కు ఇది తప్పని సరి కాబట్టి నిర్మాతలు గ్రాండ్గా ఏర్పాట్లు చేసారు.అయితే అభిమానులు ఇలా ఆందోళనలకు దిగడంతో నిర్మాత ఆలోచనలో పడ్డారట. మరి ఈ వివాదాన్ని సాయంత్రంలోపు ఏ కొలిక్కి తీసుకొస్తారో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







